Sunday, 12 October 2025

మౌనమూ శబ్దమూ!

మౌనమూ శబ్దమూ! మీ శబ్దాలన్ని మౌనాలౌతాయి కాల గమనం వాటిని మింగేస్తుంది మీ శబ్దాలన్ని శూన్యాలౌతాయి ఆత్మరహిత ప్రతిధ్వనులై మిగిలిపోతాయి మా మౌనాలన్ని శబ్దాలౌతాయి మనసు లోతుల్లో పెల్లుబికే పిడుగులవుతాయి మా మౌనాలన్ని ప్రకాశిస్తాయి నిజం రూపంలో వెలుగులు పూస్తాయి అనేక సందర్భాలలో నిశ్శబ్దమే మా భాష అది మాటల కంటే గంభీరమైన స్వరం అది కాలం చెరపలేని సత్యమై నిలుస్తుంది! Kallem Naveen Reddy

Thursday, 9 October 2025

భగవద్గీత సారాంశము

 పరమాత్మనేనమః                                                                            

శ్రీ గురుధ్యానము:

                                              భగవద్గీత సారాంశము



వ్యర్థంగా ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు అనవసరంగా భయపడుతున్నావు? ఎవరు నిన్ను చంపగలరు? ఆత్మకు చావులేదు, పుట్టుకాలేదు జరిగిన దానిగురించి బాధ, జరిగిందీ, జరుగుతున్నదీ, జరగబోయేదీ, అంతా మన మంచికే. జరగబోయే దాని గురించి  ఆతృతావద్దు. జరుగుతున్న వర్తమానం మీద శ్రద్ధ వహించు. నీదేమి పోయిందని దుఃఖిస్తున్నావు? వెంట ఏమి తెచ్చావని నీవు పోగట్టుకున్నానని బాధ

పడడానికి ? నువ్వేం ఉత్పత్తి చేసావు, అది నాశనమైందని చింతించడానికి ? నువ్వేమీ వెంట తీసుకుని రాలేదు. సంపాదించిందేదో  ఇక్కడే సంపాదించావు ఇవ్వడం కూడా ఇక్కడి వారికే ఇచ్చావు అంతేకాదు, తీసుకున్నది కూడా, 


పరమాత్మ దగ్గర నుంచే తీసుకున్నావు. ఇవ్వడం కూడా, పరమాత్మకే ఇచ్చావు. ఖాళీ చేతులతో, వచ్చావు, తిరిగి ఖాళీ చేతులతోనే వెళ్తావు. ఈ రోజు నీదనకుంటున్నది, నిన్న వేరొకరిది, మొన్న ఇంకెవరిదో. దీనిని నీదనుకుని మురిసి పోతున్నావు. ఈ ఆనందమే, నీ దుఃఖాలకు మూలం. మార్పు జీవన సిద్ధాంతం. నీవు మృత్యువని భావిస్తున్నావే, నిజానికి అది జీవితం. ఒక్క క్షణంలో నీవు కోటిశ్వరుడవు కాగలవు, మరుక్షణంలో దరిద్రుడవూ కాగలవు. నాది. నీది, చిన్న, పెద్ద, స్వపర వంటి భేద భావాల్ని తొలగించుకో, అప్పుడు అన్నీ నీవిగా, అందరూ నీవారుగా, నీవు అందరికీ చెందిన వ్యక్తిగా భావించుకో గలుగుతావు.


ఈ శరీరం నీది కాదు, నువ్వీ శరీరానికి చెందిన మనిషివీ కాదు. ఈ శరీరం అగ్ని, నీరు, గాలి, మట్టి, ఆకాశం - వీటితో తయారైంది. తిరిగి వాటిలోనే ఐక్యమైపోతుంది. కాని, ఆత్మ శాశ్వతమైనది,

మరి నీ వెవరు ?

నిన్ను నీవు పరమాత్మకు అర్పితం చేసుకో. ఇదే నీకు సర్వోత్తమమైన ఆధారం. ఇది తెలిసినవారికి భయము, చింత, దుఃఖము కలుగవు..

నీవు చేసే ప్రతి పనినీ ఈశ్వరార్పితం చెయ్యి. ఇలా చేయడం వలన నీకు సదా జీవన్ముక్తికి సంబంధించిన అనందం కలుగుతుంది.

(కృష్ణం వందే జగద్గురుమ్)


Wednesday, 1 October 2025

పరిత్రాణాయ సాధూనాం


అవ్యక్తం వ్యక్తం

అవ్యక్తంగా అనంతుడైన భగవంతుడు వ్యక్తం కావడమే అవతారము. భగవంతుని అవతారములో అనంతమైన కారుణ్యమే ప్రధానంగా గోచరిస్తుంది. ఒక్క విషయాన్ని అర్థం చేసుకుందాం. మన శరీరంలో భగవంతుడు లేని దెక్కడ? అలాగని అన్ని చోట్ల ధ్యానించ గలమా? హృదయంలోనే ధ్యానిస్తాం. ధ్యానానికి హృదయం ఉపలబ్ధి స్థానం. హృదయంలో ధ్యానం సాగుతుంది. హృదయం లోనే దైవదర్శన మవుతుంది. అంతమాత్రాన పరమేశ్వరుడు దేహంలో హృదయానికే పరిమితం అని భావించ గలమా? అంతే. దేహమంతా నియతి రూపంలో శోభిస్తున్న పరమేశ్వరుని, హృదయంలో ధ్యానించిన వారికి హృదయంలో దర్శన మిస్తాడు. అదే ఆయన కారుణ్యం.

విశ్వంలో ఈశ్వరుడు లేని దెక్కడ? విశ్వమంతా తానే నిండి నిబిడీకృతమై ఉన్నాడు. బ్రహ్మ ఏవ ఇదం విశ్వం. ఈ విశ్వమంతా బ్రహ్మమే. వివిధ ప్రత్యయ గమ్యంగా రూప శబ్దాదులతో విశ్వం గోచరిస్తూ ఉంటే, దేనికీ దూరం కాకుండా, దేనికీ అంటకుండా అభిన్న నిమిత్త ఉపాదాన కారణమైన భగవంతుడు విశ్వానికి విలక్షణంగా శోభిస్తున్నాడు. అలాంటి దివ్యాత్ముడ్ని కళ్ళు దర్శించ గలవా? దర్శించ లేవు. కనుక, బుద్ధితో చూడాలి. అవ్యక్తు డైన పరమాత్మ జ్ఞానరూపంలో బుద్ధికి అందుతాడు. తానే వ్యక్త మైతే కళ్ళకు కూడా కనిపిస్తాడు.

ధర్మ రూపంలో అవ్యక్తంగా శోభించు వాడు, దివ్యదేహధారిగా వ్యక్తమై ప్రకాశించడమే అవతారము.

ఎవరు అవతరించినా, ఏది అవతరించినా వచ్చిన పనిని చక్క పెట్టుకొని వెళ్ళేందుకేనని ఇంతకుముందే తెలుసుకున్నాం. మరి, భగవంతుడు అవతరించి నపుడు ఏయే కార్యాలు జరుగుతాయి? ఏయే ప్రయోజనాలు సిద్ధిస్తాయి?

పని ఒక్కటే ఫలితాలు మూడు

భగవంతుడు అవతరించడం అనే ఒక్క అద్భుత కార్యానికి మూడు ప్రయోజనాలు దివ్యంగా సిద్ధిస్తాయి.

అవి (1) సాధు పరిరక్షణము (2) పాప వినాశము (3) ధర్మ సంస్థాపనము.

అవతారము అందించే ఫలితాలు మూడుగా తెలుస్తున్నా, ఈ మూడింటిలో ఏ ఒక్కటి సిద్దించినా, మిగిలిన రెండూ సిద్దించినట్లే. ఈ సత్యాన్ని చివర అర్థం చేసుకుంటాం. ముందుగా ప్రయోజన క్రమాన్ని వంట పట్టించుకుందాం.

(1) సాధు పరిరక్షణము

సాధుః అంటే మంచివాడు (సజ్జనః) సన్మార్గములో చరించే వాడు సాధువు, లేదా సజ్జనుడు. అలాంటి వారిని పరిరక్షించడం అవతార ప్రయోజనాలలో మొదటిది. సన్మార్గంలో చరించేవారు సాధువులు కనుక, అలాంటి సాధువులను పరిరక్షించడమే సాధు పరిరక్షణము (సాధూనాం సన్మార్గస్థానం. పరిత్రాణాయ పరిరక్షణాయ)

సన్మార్గంలో ప్రవర్తించే వాళ్ళు సాధువులు, అయితే ఏది సన్మార్గము? ఎవరి మార్గము వారికి సన్మార్గముగానే కనిపిస్తుంది. లేకపోతే, ఇన్ని మతాలు ఎలా పుట్టుకొచ్చాయి? సన్మార్గము అంటే ధర్మమార్గము. ఏది ధర్మమార్గము? ఒకొక్క కాలానికి ఒకొక్క ధర్మము, ఒకొక్క దేశానికి ఒకొక్క ధర్మము, ధర్మనిర్ణయం ఇదమిత్థంగా తేలే విషయ మేనా? ఇదంతా వ్యావహారిక ధర్మము, ఇక్కడ ధర్మము అంటే, న్యాయము లేదా నియతి అని అర్థం చేసుకోవాలి. ఈ సృష్టిలో నియతి ఉంది. అదే ఇక్కడ ధర్మం. ధర్మరూపంలో ఉన్నది దైవమే. ధర్మమార్గంలో ప్రవర్తించడము అంటే దైవమార్గంలో సయనించడ మని అర్థము. నియతిని అనుసరిస్తూ జీవించేవాడు సాధువు (న్యాయవర్తీ సాధు  ). కనుక సాధువులు అంటే సన్యాసులు అని కాదు. ధర్మజీవనం సాగించే వారు అని అర్థము. సన్యాసులు ధర్మజీవనాన్ని సాగిస్తారు. కాని, ధర్మజీవనంలో ప్రయాణం చేసే వాళ్ళందరూ సన్యాసులు కానవసరం లేదు.

మరి, న్యాయవర్తులైన సాధుజనులు ధర్మమార్గాన చరిస్తూనే ఉంటారు కదా! అలాంటి వారిని పరిరక్షించవలసిన అవసరం ఏమిటి? వారికి మార్గంలో రక్షణ కరువై ఉండాలి. భద్రత లోపించి ఉండాలి. సాధువుల అభద్రతకు ఎవరు కారణమై ఉంటారు? సాధువులకు అభద్రతను, అవరోధాలను కలిగించేవారు అసాధువులై ఉండాలి. పాపాత్ములై ఉండాలి. సాధువులను పరిరక్షించే పవిత్రకార్యంలో పాపులను నిర్మూలించ వలసిన అవసరం ఉంది కనుక, ఇది అవతార వైభవంలో ప్రాప్తించే రెండవ ప్రయోజనము, దుష్కృతులైన పాపాత్ములయొక్క (పాపకారిణాం) వినాశము (వినాశాయ) అవతారము యొక్క రెండవ కార్యము..

పాప వినాశము

పాపకార్యాలు ఆచరించే వాళ్ళను నశింప చేయడమంటే పాపాన్ని నశింప చేయడమని అర్థము. నశింపబడేది పాపికాదు. పాపము. సాధు పరిరక్షణము ఎంత అవసరమో, పాపి వినాశము కూడా అంతే అవసరము. ధర్మమార్గంలో అవరోధంగా మారిన పాపులను తొలగించక పోతే, సాధుజీవనము ముందుకు సాగదు. సాధుజీవనం కుంటుపడితే, సమాజం కుదుట పడదు. సమాజ అభ్యుదయం సాధుజీవనంపై ఆధారపడి ఉంది కనుక, సాధుజీవనానికి ఆటంకంగా తయారైన పాపుల్ని ఏరి వేయాలి. తీసి దూరంగా పారేయాలి.

దేహంలో ఒక అవయవం కుళ్ళిపోతే, ఆ దుష్టాంగాన్ని వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగిస్తారు. అలా చేస్తేనే, వ్యక్తి బ్రతుకుతాడు, ఒకవేళ దుష్టాంగాన్ని తొలగించకుండా, అలాగే ఉంచితే దేహమంతా కుళ్ళిపోయే ప్రమాదం, తద్వారా మరణ ప్రాప్తి కలుగ వచ్చు. కనుకనే, వైద్యుడు దుష్టాంగాన్ని నిర్మూలించినట్లు, నారాయణుడు వైద్యుని పాత్రను పోషించి, సమాజం లోని పాపాన్ని నిర్మూలించి అభ్యుదయాన్ని ఆరోగ్యప్రదంగా ఉంచుతాడు. అట్టి సమాజంలో ధర్మం శోభిస్తుంది. ధర్మజీవనం దివ్యంగా ప్రకాశిస్తుంది.

ధర్మ సంస్థాపనము

ధర్మమును చక్కగా స్థాపించడమే ధర్మ సంస్థాపనము (ధర్మస్య సమ్యక్ స్థాపనం), ధర్మమును స్థాపించడము అంటే ధర్మమును స్థిరీకరింప చేయడము లేదా రక్షించడము అని అర్థము. ధర్మమును రక్షించడము అంటే, ధర్మమును ఆచరించే ధర్మాత్ములను రక్షించడము అని భావము. ధర్మాత్ములను రక్షించడము అంటే, ధర్మాత్ముల ధర్మజీవనాన్ని ఆటంకపరచే అధర్మపరులను శిక్షించడమని అర్థము. అధర్మపరులే పాపులు. వారు ధర్మమును అనుష్టించరు. పైగా అధర్మములో చరిస్తారు. వారు అధర్మములో చరించడమే గాక ధర్మమార్గాన చరించే వారికి అవరోధంగా తయారవుతారు. కనుకనే ధర్మ సంస్థాపనము అనే పవిత్ర కార్యంలో శిష్ట రక్షణముతో పాటు దుష్టశిక్షణము కూడా జరుగుతుంది. ఇదంతా అవతార కార్యము.

ధర్మరూపంలో ఉన్నది దైవమే కనుక, సర్వధర్మాలు పరమేశ్వరునే ఆశ్రయించుకొని ఉన్నాయి. ధర్మము ధర్మికన్నా వేరుగా ఉండలేదు. సృష్టి లోని ధర్మాలను వీక్షించినపుడు మన బుద్ధిలో ధర్మి లేక పరమేశ్వరుడు ప్రకాశిస్తాడు. అలాగే పరమేశ్వరుడు అవతరించినపుడు, ధర్మియైన ఆ దివ్యాత్ముని ప్రతి కదలికలో ధర్మమే. గోచరిస్తుంది. శ్రీరాముడు అవతరించాడు. ధర్మమును తాను స్వయంగా ఆచరించి చూపాడు (ధర్మం కరోతి). ఇతరులు ఆచరించడానికి ఆదర్శమయ్యాడు (ధర్మం కారయతి), ఇదంతా అవతార కార్యంలో దివ్యంగా సాగే ధర్మసంస్థాపనము.

సవరించడమా? సంస్కరించడమా?

ధర్మ సంస్థాపనము అంటే, ధర్మమును సవరించడము అని కూడా కొందరు భావిస్తారు. ఇది చాలా తప్పు. దేశకాలాదులలో నిరుపయోగంగా మారిన ధర్మాన్ని కాలానుగుణంగా సవరించి, స్థాపించడము ధర్మసంస్థాపనము అని వారి అభిమతం. ఇలాంటి మహత్తరమైన కార్యమును సామాన్యులు చేయలేరు కనుక, భగవంతుడే స్వయంగా అవతరించి ఆ కార్యాన్ని పూర్తి చేస్తాడని వారి విశ్వాసము.

ఇలాంటి వ్యాఖ్యానాలు శాస్త్ర హృదయం తెలియని వారికి వినసొంపుగానే ఉంటాయి. ఈ విధమైన దోషపూరిత వ్యాఖ్యలు ఎంత అయోమయాన్ని సృష్టిస్తాయో శాస్త్రవిదులకే తెలుసు. ధర్మాన్ని సవరించడానికి దైవం అవతరించడమే వాస్తవ మైతే, మరి, అవతారమూర్తి సవరించే ధర్మాన్ని సృష్టించిం దెవరు? భగవంతుడే కదా! మరి ధర్మాన్ని సృష్టించిన దైవానికి (ధర్మకృత్), లేదా ధర్మరూపంలో ఉన్న దైవానికి ధర్మం విషయంలో పూర్ణజ్ఞాన ముందా, లేదా? పూర్ణపురుషుడు, పురుషోత్తముడు ఏర్పరచిన ధర్మానికి కాలదోషం పడుతుందా? పడితేనే కదా సవరించాలి? సవరించడానికి అవతరించిన భగవంతుడు, ధర్మమును సృష్టించిన భగవంతుని కన్నా వేరైన వాడా? వేరైతే వీరిరువురిలో భగవంతు దెవరు? ఒక్కరే అయితే, పూర్ణ జ్ఞానమున్నవాడు కాలదోషం పట్టే ధర్మాన్ని సృష్టిస్తాడా ? ధర్మానికి కాలదోషం పడితే, ధర్మరూపంలో ఉన్న దైవానికి

కూడా కాలదోషం పట్టినట్లే కదా? అలాంటి భగవంతుడు ఒకవేళ నేడు అవతరించి ధర్మాన్ని సవరిస్తే, అదే ధర్మము భవిష్యత్తులో నిరుపయోగం కాదని చెప్పగలమా? భవిష్యత్తు అంటే ఏమిటి? తరువాత క్షణము కూడా భవిష్యత్తు క్రిందికే వస్తుంది కదా! ఇలా ఏ క్షణమైనా క్షీణించే ధర్మాన్ని సవరించడానికి భగవంతుడు అవతరించవలసిన అవసరం ఉందా? కొద్దిగా ఆలోచించ గలిగితే ఈ సవరణవాదులు సంస్కరింప బడుతారు.

సవరింప బడటానికి ధర్మ మనేది రాజ్యాంగము కాదు. పరిమిత జ్ఞానము కలవారు సృష్టించింది కాదు. త్రికాల జ్ఞావము లేనివారు తయారు చేసింది కనుక, రాజ్యాంగము కాలానుగుణంగా అనేక సవరణలతో నూతన రూపాన్ని ధరిస్తూ ఉంటుంది. సర్వజ్ఞుడైన పరమేశ్వరునికి సంబంధించిన జ్ఞానము పూర్ణజ్ఞానము కనుక అది సవరణలకు వీలు కాదు. కనుక ధర్మ సంస్థాపనము అంటే, నిరుపయోగ మైన ధర్మాన్ని రాజ్యాంగాన్ని సవరించినట్లు సవరించడం కాదు. ధర్మాన్ని ఉపయోగించుకోలేని సమాజాన్ని ధర్మాన్ని ఆచరించేలాగా సంస్కరించడమే. కనక ధర్మసంస్థాపనము అంటే, ప్రజలు ధర్మాన్ని ఆచరించేలా చేయడమే. ఆచరించ వలసింది ధర్మము. ఆచరించ కూడనిది అధర్మము. ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరించక పోవడమే గాక, ఆచరించ కూడని అధర్మాన్ని ఆచరించడం వల్ల సమాజం ధర్మజీవనానికి దూరమౌతుంది. ధర్మానికి దూరమైన సమాజము దగా పడుతుంది. నశించి పోతుంది. ఈ పరిస్థితిని చక్క చేయాలి అంటే సర్వజనులు ధర్మ మార్గంలో చరించేలా చూడాలి. ఈ విధమైన మంగళకార్యాన్ని నిర్వర్తించడానికే భగవంతుడు అవసరాన్ని బట్టి రూపం. ధరించి అవనిపై అవతరిస్తాడు. అవతారమూర్తి స్పూర్తితో అధర్మపరులు కూడా ధర్మమూర్తులై శోభిస్తారు. ఈ పవిత్రమైన కార్యాన్ని నిర్వర్తించడానికే తాను ప్రతి యుగం లోను అవతరిస్తూ ఉంటాను అంటున్నాడు.

(తధర్ధం సంభవామి యుగే యుగే ప్రతియుగమ్). యుగమంటే కాలం

ప్రతి యుగంలోను తాను అవతరిస్తూ ఉంటాను అన్నాడు భగవంతుడు. అంటే, అవతార మనేది. కేవలం ఆ యుగంలోనే రావాలి అని లేదు. ఏ యుగంలోనైనా రావచ్చు. అంతేకాదు, ప్రతి యుగంలో తప్పకుండా రావాలి అని కూడా లేదు. అవసరాన్ని బట్టే అవతారము. మనం నిర్మించుకున్న గృహం పాడైతే మనం బాగు చేసుకుంటాము. ఎప్పుడు బాగు చేసుకుంటాము? ఎప్పుడు అవసరమొస్తే అప్పుడు బాగు చేసుకుంటాము. ఇదీ అంతే.

సమాజానికి సరియైన ధర్మబోధలు అందుతున్నంత కాలం ప్రజలు ధర్మాన్ని అనుష్టిస్తూనే ఉంటారు. ధర్మాచార్యులు, సాధుపురుషులు సన్మార్గాన్ని నిర్దేశిస్తున్నంత కాలం ధర్మజీవనాన్ని జనులు కొనసాగిస్తూనే ఉంటారు. బోధలు అందక పోయినా, లేదా దుర్బోధలు బోధల రూపంలో వ్యాప్తి చెందినా ప్రమాదం వాటిల్లుతుంది. సమాజం ధర్మం విషయంలో సందిగ్ధంలో పడి పోతుంది. ఇలాగే చాలా కాలం కొనసాగితే సమాజం ధర్మం విషయంలో నిర్వీర్యమై నిస్సార మవుతుంది. ఇదే ధర్మగ్లాని. ఇలా భయంకరంగా, చీభత్సంగా తయారైన సమాజాన్ని మరల ధర్మవృక్ష ఛాయలో నిలిపేందుకు మాధవుడు మానవుడై అవతరించి, అనితర సాధ్యంగా ధర్మ సంస్థాపనము గావిస్తాడు.

త్రాణం అంటే రక్షణము. సాధురక్షణము అనే మొదటి ప్రయోజనములో 'త్రాణాయ' అంటే సరిపోతుంది. కాని, 'పరిత్రాణాయ' అన్నాడు భగవంతుడు. 'పరి' అనే ఉపసర్గతో పలికి ఏ ఒక్కరినో కాకుండా అందరినీ రక్షించడం అంతటా రక్షణ నెలకొల్పడం జరుగుతుందని సూచించారు (పరితః త్రాణమ్). నాశః అంటే నాశము. దుష్ట శిక్షణము అనే రెండవ ప్రయోజనములో 'నాశాయ' అంటే సరిపోతుంది. కాని, భగవంతుడు 'వినాశాయ' అన్నాడు. నాశము అంటే నశించడం అని అర్థము. వినాశము అంటే సమూలంగా, కారణ సహితంగా నశించడము అనే అర్థాన్ని సూచిస్తూ 'వినాశాయ' అన్నాడు. స్థాపనము అంటే స్థాపించడం. ధర్మ సంస్థాపనము అనే మూడవ ప్రయోజనములో 'స్థాపనార్థాయ' అంటే సరిపోతుంది. కాని 'సంస్థాపనార్థాయ' అన్నాడు భగవంతుడు, 'సం' అంటే సమ్యక్ అని అర్థం. అంటే, బాగుగా, చక్కగా అని భావము, అనంతుడు అవతారమెత్తినపుడు ధర్మం పూర్ణంగా స్థాపింప బడుతుంది అనే అర్థాన్ని సూచిస్తూ 'సంస్థాపనార్థాయ' అన్నాడు.

ఆఖ్యాయిక 

పూర్వం ఒక రాజు గారికి భగవంతుడు అవతరించడం అనే విషయం అస్సలు నచ్చేది కాదు. భగవంతుదేమిటి, అవతరించడం ఏమిటి? విశ్వంలో ధర్మాన్ని చక్కబెట్టాలి అనుకుంటే, ఆయనే దిగిరావాలా? రాజ్య పరిపాలనలో తనకే ఎందరో సహకరించి తన ఆజ్ఞలను పాటిస్తూ, పరిపాలనా వ్యవహారాలను చక్కబెడుతున్నప్పుడు, ఈ విశ్వ యంత్రాంగంలో పరమేశ్వరుని ఆజ్ఞలను పాటించే వారే లేరా? అని వితండంగా వాదిస్తూ ఉండేవాడు. ఆయన వాదన ఎవ్వరికీ నచ్చక పోయినా, ప్రభువు కావడం చేత ఎవ్వరూ ప్రతివాదం. చేసేవారు కారు. మంత్రిగారు మంచి భక్తుడు. నైష్ఠికుడు. శాస్త్ర పాండిత్యం కలవాడు. రాజుగారి వైఖరి తనకు నచ్చకపోయినా, తనలో తాను మధన పడేవాడే గాని రాజు గారిని వారించే వాడు కాదు. సాయంత్రాలలో గంగానదిలో నౌకా విహారం చేయడం రాజుగారికి సరదా. మంత్రి గారిని, కొందరు పండితులను నావలో ఎక్కించుకొని శాస్త్ర చర్చ చేస్తూ విహరించడం అలవాటు. ఒకరోజు సాయంత్రం అందరూ కలిసి నదిలో నౌకా విహారం చేస్తూ ఉన్నారు. శాస్త్ర చర్చ జరుగుతూ ఉంది. ఇంతలో ఆ నౌక లోనే తమతో పాటు విహరిస్తున్న రాజుగారి ఐదేళ్ళ కుమారుడు పట్టు తప్పి నదిలో పడి పోయాడు.

అయ్యో, అయ్యో! బాబు పడిపోయాడు! అంటూ మంత్రి బిగ్గరగా అరిచాడు. అంతే, వెంటనే రాజుగారు నది లోకి దూకి, మునిగి పోతున్న కుమారుణ్ణి ఎత్తుకొని, ఈదుకుంటూ వచ్చి నావ నెక్కాడు. తీరా చూస్తే, రాజుగారి చేతిలో ఉన్నది పిల్లవాని ప్రతిమ మాత్రమే! పిల్లవాడు కాదు. రాజకుమారుడు మంత్రిగారి వెనుక కూర్చుని కనిపించాడు. విషయం అర్థం గాక, రాజు నివ్వెర పోయాడు. ప్రభూ! క్షమించండి. మీ బిడ్డ ఇక్కడే మా వద్ద క్షేమంగా ఉన్నాడు. నదిలో పిల్లవాడి బొమ్మను మీరు చూడకుండా పడేసింది మేమే. మీ బిడ్డ నదిలో పడిపోయాడు అనగానే మీరే ఎందుకు నది లోకి దూకారు? నది లోకి దిగి మీ బిడ్డని కాపాడటానికి ఇంత మంది నావలో ఉన్నా, మీరే ఎందుకు రంగం లోకి దిగారు? మమ్మల్ని ఆజ్ఞాపించ వచ్చు కదా! ఆలోచించండి.

మీ బిడ్డపై ఉన్న ప్రేమ చేత ముందు వెనుక చూడకుండా మీరే ఎలా నది లోకి దూకారో, తన 

బిడ్డలైన భక్తుల మీద ఉండే ప్రేమ వల్ల భగవంతుడు కూడా తానే స్వయంగా అవతరిస్తాడు అని వినయంగా పలికి మంత్రి తల దించుకున్నాడు. రాజు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం చెందాడు. భగవంతుని అవతారానికి హేతువు ప్రేమే అని గ్రహించాడు.

భగవంతుని అవతార వైభవము, అవతారము సాధించే ప్రయోజనాలు తెలిశాయి. వీటిని తెలియడం వల్ల మన కేమి ప్రయోజనం? చెబుతున్నాడు.తదుపరి శ్లోకంలో .. 


Monday, 22 September 2025

అనన్యా శ్చిన్తయన్తో మాం - గీత 9-22 # చైతన్య భగవద్ గీత #రాజవిద్యారాజగుహ్య యోగము


‘అమ్మా! నా పేరు రంగడు. నేను పనులు చేసుకుంటూ బ్రతుకుతుంటాను. మీ వారు మా శేఠ్ వద్ద ఈ

సరుకులు తీసుకొని, తొందరగా మీకు ఇచ్చి రమ్మని నన్ను ఆజ్ఞాపించారు. నేను బయలుదేరడంలో కొంత ఆలస్య మైందని ఆగ్రహించి, అక్కడే ఉన్న ముల్లుకర్రతో నన్ను కొట్టారు. ఆ ముల్లు గీసుకుని రక్తం వచ్చింది. అంతే' అన్నాడు ఆ బాలుడు.

'అయ్యో! ఎంత తొందర అయితే మాత్రం పసిబిడ్డను ఇలా కొట్టడమా? ఉండు నాయనా! కాస్త తుడిచి

మందు వేస్తాను' అని ఆమె లోపలి కెళ్ళింది. ఆమె తిరిగి వచ్చే లోగా బాలుడు తిరోహితు డయ్యాడు.

ఇల్లాలు మూటను విప్పి చూచింది. అందులో కుటుంబము లోని వారందరికి బట్ట లున్నాయి. కొన్ని నగలున్నాయి. కొంత నగదు కూడా ఉంది.

సంచులలో చూస్తే వంట సరుకులు పుష్కలంగా ఉన్నాయి. ఆశ్చర్య పోయిన ఆ తల్లి వెంటనే షడ్రసోపేతమైన పాకం చేయడానికి సిద్ధమై చకచకా చేస్తూ ఉంది. ఈ లోగా దీన వదనుడై ఇంటి వైపు వస్తున్న భర్తను చూచి, పరుగు పరుగున ఆయనను సమీపించింది.

ఆమెను చూడగానే భర్త కన్నీళ్ళను ఆపుకోలేక పోయాడు.

'నా ప్రయత్న మంతా నేను చేశాను. ఎవరిని అడిగినా, ఎంతగా ప్రాధేయ పడినా, ఎవ్వరూ కనికరించ

లేదు. ఆకలితో అలమటిస్తున్న బిడ్డలకు కనీసం గంజైనా త్రాగించ లేని నా  దారిద్ర్యానికి సిగ్గు పడుతున్నాను' అని ఆ భక్తుడు పసిబిడ్డలా రోదించాడు.

భార్య విస్మయం చెందింది. 'అదేమిటి! మీరు పంపిన సరుకులతో నేను వంట కూడా చేస్తూ ఉంటే,

మీరేమిటి అలా మాట్లాడుతారు?' అని ప్రశ్నించింది. 'నేను సరుకులు పంపడమేమిటి?' అని తిరిగి ప్రశ్నించాడు భర్త.

జరిగిన విషయ మంతా ఆమె పూస గుచ్చినట్లు చెప్పింది. బాలుడి వీపుపై ముల్లుగీత వల్ల ఏర్పడిన

గాయాన్ని గూర్చి కూడా చెప్పింది. భక్తుడు నిర్ఘాంత పోయాడు. తీరా వెళ్ళి పూజా మందిరంలో చూస్తే, తాళపత్రంపై ముల్లుగీత లేదు. చిరుగు అసలే లేదు. గ్రంథము మామూలుగా ఉంది.

తన తప్పిదానికి భక్తుడు పరితపించాడు. తీవ్రమైన ఉద్విగ్నతకు లోనయ్యాడు. పాండురంగని దివ్య

దర్శనానికి నోచుకున్న అర్ధాంగి అదృష్టానికి పరవశించి పోయాడు.

'భగవాన్! పాండురంగా! నా అజ్ఞానాన్ని క్షమించు. నీ మాట ఎన్నడూ వృథా కాదు. నీ భక్తుడు ఎప్పుడూ వృథా పోడు. గీతపై ముల్లుతో గీస్తే అది నీ దేహంపై గీసినట్లు అయిందా? నాకు కనువిప్పు కలగడానికి నా చేత నువ్వే అలా చేయించావా? నీ గీతా వాక్యం సత్యం కాదని అనుమానించాను. కాని, గీత నీ దేహమేనని, నీ స్వరూపమే నని గ్రహించలేక పోయాను' అని పశ్చాత్తాపం చెంది, పరమేశ్వరుడు అనుగ్రహించిన నగలను, నగదును పేదలకు పంచిపెట్టి, రెట్టించిన భక్తి శ్రద్ధలతో ఆ భక్తుడు అనన్య భక్త్యారాధనకు పునరంకిత మయ్యాడు.

గీతాశ్రయో_హం తిష్ఠామి గీతామే చోత్తమం గృహమ్ |

గీతా జ్ఞాన ముపాశ్రిత్య త్రీన్లోకా న్పాలయా మ్యహమ్ ||

నేను గీతను ఆశ్రయించుకొని ఉన్నాను. గీతయే నాకు వాస మందిరము. గీతా జ్ఞానమును ఆధారం

చేసుకొని నేను ముల్లోకాలను పాలిస్తున్నాను అని వరాహ పురాణంలో భగవానుడు భూదేవికి బోధించాడు.

అనన్య భక్తి అనేది అనేక జన్మల పుణ్యఫల విశేషం. నిరంతరాభ్యాసం వల్ల ప్రాప్తించే భగవదనుగ్రహం. అనన్య భక్తి తత్పరులైన ఏకాంత భక్తుల హృదయాలలో పరమేశ్వరుడు తప్ప మరొకటి ఉండే అవకాశం లేదు. వాళ్ళు కేవలం భగవచ్ఛరణులు. కనుక వారి యోగక్షేమాలను పరమేశ్వరుడే చూసుకుంటాడు. (కేవల మేవ భవచ్చరణాః తే అతః భగవా నేవ తేషాం యోగక్షేమం వహతి ఇతి).

అనన్య భక్తిలో రమించే ఏకాంత భక్తులు భగవంతుని కన్నా అన్యమైన సమస్త విషయాలలో ఉపేక్షా

భావాన్ని కలిగి ఉంటారు. చివరికి బ్రతుకులో గాని, చావులో గాని చెక్కు చెదరని, మొక్కవోని భక్తితోనే

శోభిస్తూ ఉంటారు. (న హి తే జీవితే మరణేవా ఆత్మనః గర్దిం కుర్వన్తి!). పరమేశ్వరుని క్షణం విడిచి జీవించ లేరు. బ్రతుకులో ఏదైనా జరగనీ, బుద్ధిలో భక్తిని మాత్రమే ప్రధానంగా ఉంచుకుంటారు. క్షణక్షణానికి పెంచు కుంటారు.

పల్లవి: నీవు లేక నేను లేను - లేను నిన్ను విడిచి నేను ఉండలేను ॥నీవు ||

చరణము:బ్రతుకు బండలైనా బుద్ధి పండి ఉంది మాధవ మాధవ యనుచు మథన పడుతూ ఉంది

కొన ఊపిరైనా తూలుతూ నీ పాదము చేరు ॥ నీవు ||

అని చైతన్య గీతిక అనన్య భక్తి రాగాన్ని ఆలపించింది.

ఇంతవరకు మనం భక్తి ప్రధానమైన కర్మయోగానుసారము ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పుకున్నాం.

ఇప్పుడు జ్ఞానపరంగా చూద్దాం.

అనన్య చింతనము

అనన్యులు అంటే అన్యంగా ఉండని వారు. పరమాత్మ కన్నా తాము వేరు అని భావించని వారు

అనన్య చేతస్కులు (అనన్యాః అపృథగ్భావాః) పరమాత్మను ఆత్మ స్వరూపంగా దర్శించి ఉపాసించే వారు అని అర్థము. అట్టి వారి యొక్క యోగక్షేమాలను పరమాత్మే వహిస్తాడు. జ్ఞాని పరమాత్మ కన్నా అన్యంగా లేదు కనుక, జ్ఞాని యోగక్షేమాలను స్వయంగా పరమాత్మే చూసుకుంటాడు.

జ్ఞానీ త్వాశైవ మే మతమ్ - 'జ్ఞాని నా ఆత్మయే' అని ఏడవ అధ్యాయం - పద్దెనిమిదవ శ్లోకంలో

భగవంతుడే చెప్పి ఉన్నాడు కదా! అందుచేత జ్ఞాని యొక్క అవసరాలు పరమాత్మ అవసరాలుగా మారుతాయి. కనుక జ్ఞాని యోగక్షేమాలను పరమాత్మే వహిస్తాడు.

అయితే, ఈ సందర్భములో శ్రీ శంకరాచార్య స్వామి భాష్యంలో ఒక ఆసక్తికర మైన విషయాన్ని

వినిపిస్తారు. నను అన్యేషా మపి భక్తానాం యోగక్షేమం వహత్యేవ భగవాన్? మరి, జ్ఞానులు కాని భక్తుల యొక్క అనగా కర్మయోగుల యొక్క యోగక్షేమాలను కూడా భగవంతుడు వహిస్తాడు కదా! నిజమే. అది సత్యం. తప్పక వహిస్తాడు (సత్యం ఏవమ్; వహతి). మరి భక్తుల యోగక్షేమాలను కూడా తానే వహించే టప్పుడు, తన స్వరూపమైన జ్ఞానుల యోగక్షేమాలను చూసుకుంటాడు అని ప్రత్యేకించి చెప్పడంలో విశేష మేమిటి? అనేది శంక. విశేష ముంది. అదేమిటంటే,

అన్య యే భక్తాః తే స్వాత్మార్థం స్వయమపి యోగక్షేమం ఈహస్తే అనన్య దర్శినః తు న ఆత్మార్ధం యోగక్షేమం ఈహన్తో- భక్తులు తమ యోగక్షేమాలకై తాము ప్రయత్నం చేసుకుంటూనే, పరమేశ్వరుణ్ణి కూడా ప్రార్థిస్తూ ఉంటారు. అనన్య దర్శులైన జ్ఞానులు తమ యోగక్షేమాలను తాము పట్టించుకోరు. అంతటా ఉపేక్షా భావంతో ఉంటారు. ఇదే ఇద్దరి మధ్య భేదము. ఈ శ్లోక వ్యాఖ్యానంలో మనం చెప్పుకున్న పండరీ భక్తుడు కూడా భార్య సలహా మేరకు ఊళ్ళో కెళ్ళి తన ప్రయత్న మేదో తాను చేశాడు కదా! అదే జ్ఞాని అయితే చేయడు. పూర్ణ విశ్వాసంతో పరమేశ్వరుని యందే బుద్ధిని నిలిపి ఉంచుతాడు. అదే విశేషము.

శివో భూత్వా శివం భజేత్ - శివుడవై శివుణ్ణి ఆరాధించు అన్నట్లుగా, జ్ఞానులు తమ ఆత్మే పరమాత్మ

అనే బ్రహ్మాత్మ జ్ఞానంతో పరమాత్మను ఉపాసిస్తూ ఉంటారు కనుక, వారి యోగక్షేమాలను పరమాత్మే వహిస్తూ ఉంటాడు.

అన్యమైన విషయాల నుండి దూరంగా పోవాలని ప్రయత్నించే వారు కర్మయోగులు, లేదా భక్తులు. తమలో అన్యమైన విషయాలే లేకుండా చేసుకొనే వారు జ్ఞానులు.


Friday, 1 August 2025

నమస్తే తెలంగాణ….. విద్యార్థి… నీ హక్కులేవీ? సల్వాజి మాధవరావ్ - 93916 73807

నమస్తే తెలంగాణ….. విద్యార్థి… నీ హక్కులేవీ? సల్వాజి మాధవరావ్ - 93916 73807 తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల పోరాటాల పునాదులపై నిర్మితమైంది. 1969 నాటి తొలి దశ ఉద్యమం నుంచి 2009లో మలి దశ ఉద్యమం దాకా…… ప్రత్యేక తెలంగాణ పోరాటానికి మూలస్తంభాలు విద్యార్దులే. కానీ, ఈ రోజు అదే విద్యార్థి లోకం నిర్లక్ష్యం, నిరాశ, నిస్పృహ, నిరుద్యోగం మధ్య కొట్టుమిట్టాడుతున్నది. 2023 లో నిరుద్యోగులకు ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా యువత భవిష్యత్తును గాలికొదిలేసింది. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల చావులు ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తున్నాయి. పాముకాట్లు, ఫుడ్ పాయిజన్, నీటి కొరత, శానిటైజేషన్ పై నిర్లక్ష్యం గురుకుల విద్యార్థుల జీవితాలను హరిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలోనూ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. పేద విద్యార్థుల కుటుంబాలు లక్షల్లో ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాయి. గురుకులాల బోధనలో నాణ్యత లోపం కనిపిస్తున్నది. ఒకవైపు జాతీయ స్థాయిలో పోటీ పెరుగుతుంటే, మన విద్యా విధానం మాత్రం పాత పద్ధతుల్లోనే సాగుతూ వెనకబడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల హక్కుల పరిరక్షణపై ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేకుండా పోయింది. అబద్దపు హామీలతోనే మభ్యపెడుతూ, సమయానుకూలంగా వాగ్దానాలను వాయిదా వేస్తూ వస్తున్నది. ఐదు లక్షల విద్యా భరోసా కార్డు, విద్యార్థినులకు స్కూటీలు తదితర హామీలు అటకెక్కాయి. ఈ నేప థ్యంలో బీఅర్ఎస్వీ విద్యార్థి హక్కుల కోసం పోరాటానికి సిద్ధమైంది. ఇది కొత్తగా మేలుకోవాల్సిన సమయం. మన భవిష్యత్తు మన చేతు ల్లోనే ఉంది. విద్యారంగంలో సమర్థవంతమైన మార్పు కోసం, ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదల, ఫీజు రీయింబర్స్మెంట్ నిబంధనల సవరణ, రెసిడెన్షియల్ విద్యాలయాల పునరుద్ధరణ, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలు కోసం పోరాటం చేయాలి. ఓ విద్యార్థి మేలుకో! నీవు నిద్రపోతే, నీ కలలను వేరే వారు దోచేస్తారు. నీవు మౌనంగా ఉంటే, నీ హక్కులు మట్టిలో కలిసి పోతాయి. నీవు గళమెత్తితే భవిష్యత్తు మారుతుంది. నీవు | పోరాటానికి సిద్ధమైతే పాలకులు జవాబుదారీగా మారుతారు. రాష్ట్రంలో విద్యార్థుల హక్కుల కోసం బీఅర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) ముందుకువస్తున్నది. ఒక సంఘటిత విద్యార్థి శక్తిగా మారాల్సిన అవసరం ఉంది. ఉద్యమాల చరిత్ర కలిగిన తెలంగాణ భూమిలో మరోసారి విద్యార్థి గళం మార్మోగాలి. ఓ తెలంగాణ విద్యార్థి! నీ గళాన్ని వినిపించు! నీ న్యాయం కోసం నువ్వే పోరాడాలి! సంకేతాలు స్పష్టంగా ఇవ్వు. 'మా హక్కులు మా చేతుల్లోకి రావాలి' 'మేం చదివితేనే తెలంగాణ వెలుగుతుంది' ఓ విద్యార్థి నీ హక్కులకై మేలుకో! తెలంగాణ సాధనకు ఉద్యమంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఒక ప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి ఆందోళనలు. తెలంగాణ ఏర్పాటుకు వేదికయ్యాయి. 1969లో మొదలైన ఉద్యమం. నుంచి 2014లో రాష్ట్ర స్థాపన వరకు విద్యార్థి సంఘాలే గొంతెత్తి నిన దించాయి. అలాంటి పునాది ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఏమిటి? ఉద్యోగ నోటిఫికేషన్లలో జాప్యం జరుగు తున్నది. గ్రూప్-1, డీఎస్సీ, టీసీ పీఎస్సీ నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. వచ్చినా పరీక్షల రద్దు, అవకతవకల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యలో నాణ్యత లోపాలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో లెక్చరర్లు లేరు. ఫీజు రీయిం బర్స్మెంట్ ఆలస్యమవుతున్నది. నిరుద్యోగ యువత నిరాశతో ఆత్మ హత్యలు చేసుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రభావంతో విద్యారంగాన్ని ప్రైవేటీకరిస్తూ, సామాన్య విద్యార్థికి విద్యను అంద కుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్వీ అవసరం ఎంతో ఉన్నది. ఈ సమస్యలు పోరాటాల ద్వారానే పరిష్కారమవుతాయి. బీఆర్ఎస్వీ విద్యార్థి వాణిగా మారాలి. ఉద్యమ గళంగా మారాలి. ఇప్పుడు ఉన్న విద్యార్థి సంఘాలు బలహీనంగా మారిన నేపథ్యంలో కేవలం జెండా కోసం కాదు, పోరాట విలువల కోసం ఒక శక్తిగా మారాలి. బీఆర్ఎస్వీ అదీ ఆకాంక్షతో పనిచేయాలి. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడే విద్యావ్యవస్థ కోసం పోరాడాలి. ఈ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచే విధానాలు రాష్ట్రంలో పెరు గుతున్నాయి. హిందీని ప్రవేశపెట్టాలనుకోవడం, జాతీయ ప్రవేశ పరీ క్షల్లో స్థానిక విద్యార్థులకు అన్యాయం, కేంద్ర బోర్డుల పెత్తనం నేప థ్యంలో తెలంగాణ స్ఫూర్తికి అనుగుణంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దే. ఉద్యమ వేదికగా మారాలి. యూనివర్సిటీ, డిగ్రీ, ఇంటర్ స్థాయిలో విద్యార్ధి సమస్యలపై చట్టపరంగా పోరాడాలి. క్యాంపస్ లెవెల్ నుంచి జిల్లాల వరకు స్టూడెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలి. ఉద్యోగ నోటి ఫికేషన్ల కోసం నిరంతరం పోరాడాలి. సామాజిక న్యాయం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల విద్యా హక్కుల కోసం నిలబడాలి.

Wednesday, 30 July 2025

Condolence meeting of Hon'ble MLA Late Maganti Gopinath was held at Veterinery colony, shaikpet, filmnagar

A grand success! Condolence meeting of Hon'ble MLA Late Maganti Gopinath was held at my residence in Jubilee Hills constituency. The meeting was attended by his family Sunita Gopinath, 30 Colony Association members from Shaikpet division, 52 booth committee members and prominent leaders including Chief Guest Janaab Mahmood Ali sahab Ex Home minister and MLC Dr.Dasoji Sravan Incharge Shaikpet. BRS party members also participated, showing solidarity and support. M A Moyeed khan Brs Senior leader. 29-07-2025

Monday, 21 July 2025

మేలుకో తెలంగాణోడా! - సల్వాజి మాధవరావు - 90525 63147

మేలుకో తెలంగాణోడా! ఓ తెలంగాణోడా... ఇప్పటికైనా మేలుకో! నువ్వు నమ్మిన నీ పల్లె, నీ పంట, నీ పోరాటం ఇవన్నీ మళ్లీ పాత పాత బానిసత్వపు నీడల్లోకి లాగుతున్నారు. నీకు స్వంత రాజ్యం వచ్చింది. కానీ, నీ కష్టానికి సరైన న్యాయం దక్కుతుందా నీ మట్టిలో నీళ్లు పోశామంటున్నారు కానీ నీ చిగురు ఎందుకు వాడిపోయింది? నిన్న నీ నీళ్లకు హక్కు ఉంది ఇవాళ నీ వంతు నీళ్ల కోసం మళ్లీ నువ్వే ఎద్దు కట్టుకుని పోవాల్సిన పరిస్థితి వచ్చింది. నీ పొలం నీదే కానీ పంట తీగల్ని ఎక్కడ కత్తిరించాలో చెబుతున్నారు వాళ్ళే నీ విత్తనానికి నువ్వు మూలధనంవె కానీ పంట నాజూకుదనానికి మూల్యం చెప్తారు మరొకరే. ఎన్ని రైతుబంధు మాటలు వినినా నీ చేతిలో మట్టి లేదు - రుణం ఉంది నీ కష్టంలో పంట లేదు - కత్తి ఉంది ఆ కత్తిని మళ్లీ మనల్ని మనమే పొడుచుకునేలా చేస్తుంది మన ఉద్యమమే లాభపడదూ తెలంగాణోడా! మేలుకో తెలంగాణోడా ఇది నీ గళం, నీ గడ్డ, నీ గొప్పతనం!! ఓ తెలంగాణోడా... నీ నిద్ర ఇంకా ముగియలేదా? నీ చెమట తడికి పుట్టిన తెలంగాణా నేడు మళ్లీ చెర గడిలోకి జారిపోతోంది . నువ్వు పోరాడిన స్వయం పాలన ఇప్పుడు మరోసారి పరాయివారి చేతుల్లో నరకంలా మారింది. నిన్న నీ గొంతు ఉద్యమమైంది , నేడు అదే గొంతు మౌనం పట్టింది , ఇప్పుడా చేతుల్లో ఉన్నది కేవలం ఓ రుణపు పట్టా . నువ్వు నమ్మిన మాటలు మోసం చేశాయి. రైతుబంధు అంటూ ఇచ్చిన హామీలు, నీ చేతిలో మట్టి కాదు - అప్పుల కాగితాలని పెట్టాయి…నీ భూమి నీదే, కానీ, నీ భవిష్యత్తు ఎవరో తేల్చేస్తున్నారు. ఓ యువకుడా... నీ కలలు ఖాళీ మాటలే అవుతాయి గాని నీ అడుగులు ఉద్యమ జాడలై మారిపోవాలి. ఓ నాయకుడా.. నీ పదవి గొప్ప కాదు, నీ ప్రజల బాధే నీ బాధగా మారాలి. ఈ తెలంగాణ నీది! నీ చెమట తడిచిన గడ్డను నీ కన్నీటి నీటితో తడిపే గుగురుతో రక్షి ఓ తెలంగాణోడా...! అడుగు వేసే ప్రతిచోట.... పొలిమేరలు మళ్లీ నినాదాలతో దద్దరిల పల్లెలు మళ్లీ చైతున్యంతో దద్దరిల్లాలి ప్రజల గళమే ఉద్యమానికి మార్గదర్శి కా ఉద్యమం అంటే కేవలం ధర్నా కాదు ప్రతి చైతన్యమైన మనిషి మన ప్రాంతానికి వెన్నుదన్నుగా మారినప్పుడే- అది నిజమైన ఉద్యమం రేపటి ఉదయం కోసం ఉద్యమం మళ్లీ అవసరమే….ఓ తెలంగాణోడా... ఇప్పటికైనా నిద్రలేవు? నువ్వు పుట్టించిన ఈ రాష్ట్రం.. ఇప్పుడీ పాలకుల చేతిలో మళ్లీ చెరగంటలు మోగుతోంది ! నీ పోరాటం పండించిన గడ్డ మీద మళ్లీ పరాయివాళ్ళే పాలకులయ్యారు.. రైతన్నా..నీ మట్టిలో విత్తనం వేస్తే పంట పుట్టాలి కానీ, ఇప్పుడు రుణాల తాడులు మాత్రమే మొలుస్తున్నాయి నీ చెమటను కొనుగోలు చేసే వ్యవస్థ లేదు. నీ ధైర్యాన్ని చీల్చే పాలకులు మాత్రం గుట్టలుగా ఉన్నారు! యువతా... నీ శబ్దం ఎక్కడ?. నీ సోషల్ మీడియా పోస్ట్ ఓ రెవల్యూషన్ కాదు. నీ పాదం ప్రగతికి పడాలి బాట నీ గళం మరలా ఉద్యమానికి గర్జించాలి. ఇంకా ఒక్కసారి అడుగులే నినాదాలవాలి. పల్లె ప్రతీ మూలలో ఉద్యమం మెరుపులు రావాలి. ప్రతీ పొలంలో తిరిగి పోరాటపు పదాలు మొలకెత్తాలి! ఇదే సమయంలో, ఇదే పిలుపు: 'ఓ తెలంగాణోడా - మళ్లీ ఉద్యమించు' 'బానిసత్వం భవిష్యత్తుకే బెడద ఉద్యమమే మన ఓటుకు గౌరవం మన భూమికి, మన నీళ్లకు, మన హక్కులకై మనం మళ్లీ మేలుకోవాల్సిందే! జై తెలంగాణ! జైజై తెలంగాణ!! సల్వాజి మాధవరావు - 90525 63147

links

https://archive.org/details/@sudarshan_reddy330 https://archive.org/details/@sudarshan_reddy330?query=swami+sundara+chaitanyananda videos:...