Tuesday, 5 May 2026

links

https://archive.org/details/@sudarshan_reddy330

https://archive.org/details/@sudarshan_reddy330?query=swami+sundara+chaitanyananda

videos:https://archive.org/details/@sudarshan_reddy330?query=swami+sundara+chaitanyananda&page=8&and%5B%5D=mediatype%3A%22movies%22


books:https://archive.org/details/@sudarshan_reddy330?query=swami+sundara+chaitanyananda&and%5B%5D=mediatype%3A%22texts%22


audios: https://archive.org/details/@sudarshan_reddy330?query=swami+sundara+chaitanyananda&and%5B%5D=mediatype%3A%22audio%22

*****************************************************************************


total 183 files: https://archive.org/details/@sundarachitanyam_ysreddy

144 files: https://archive.org/details/@sundarachitanyam_ysreddy?query=swami+sundara+chaitanyananda

133 videos: https://archive.org/details/@sundarachitanyam_ysreddy?query=swami+sundara+chaitanyananda&and%5B%5D=mediatype%3A%22movies%22

7 files audios: https://archive.org/details/@sundarachitanyam_ysreddy?query=swami+sundara+chaitanyananda&and%5B%5D=mediatype%3A%22audio%22

*******************************************************

చైతన్య చేమంతులు#swami_sundara_chaitanyananda

https://archive.org/details/20260331_572/page/n31/mode/2up


********************************************************************************

Lord Krishna#swamiji#Scaned Mini Photos - 40









Saturday, 21 February 2026

తెలంగాణ ఆత్మ – కేసీఆర్ - Prasad Kasula

 

తెలంగాణ ఆత్మ – కేసీఆర్ - Prasad Kasula

చరిత్రలో కొందరు వ్యక్తులు నాయకులు కాదు… వారు ఒక ఉద్యమం. ఒక జ్వాల. ఒక జాతి గౌరవానికి ప్రతిరూపం.

1952లో పొట్టి శ్రీరాములు గారు తెలుగు భాష కోసం ప్రాణత్యాగం చేశారు. ఆయన శరీరం క్షీణించింది… కానీ ఆయన సంకల్పం రాష్ట్రాన్ని సృష్టించింది. ఆ త్యాగాన్ని మనం గౌరవంగా చదువుతాము… మనసారా నమ్ముతాము.

అదే విధంగా, తెలంగాణ కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. 

ఆయన కేవలం రాజకీయ నాయకుడు కాదు — తెలంగాణ గుండె చప్పుడు. ఆయన దీక్ష కేవలం ఆహారాన్ని త్యజించడం కాదు… అది ఒక జాతి ఆత్మగౌరవం కోసం చేసిన అగ్నిప్రమాణం.

ఆయన స్వరం ఢిల్లీ గోడలను తాకింది. ఆయన సంకల్పం లక్షల మంది యువతలో జ్వాలగా మారింది. విద్యార్థుల అరుపులు, ఉద్యోగుల సమ్మెలు, ప్రజల కన్నీళ్లు—all ఒకే దిశగా కదిలేలా చేసిన శక్తి ఆయన నాయకత్వం.

2014లో తెలంగాణ అవతరించింది. ఆ రోజు కేవలం ఒక కొత్త రాష్ట్రం పుట్టలేదు… అది ఒక జాతి గర్వం తిరిగి పుట్టిన రోజు.

కాలం మారుతుంది… విమర్శలు వస్తాయి… కీర్తిని చెరిపివేయాలనే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ చరిత్రలో రక్తంతో రాసిన పేర్లు ఎప్పటికీ చెరిగిపోవు. తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ గారి పేరు ప్రజల గుండెల్లో ఉంటుంది.

“తెలంగాణ రాష్ట్ర నాయకుడు” అని పలికిన ప్రతిసారి,

“తెలంగాణ రాష్ట్ర ప్రజలు” అని సంభోదించిన ప్రతిసారి,

ఆ ఉద్యమ స్పూర్తి… ఆ త్యాగం… ఆ నాయకత్వం గుర్తుకు వస్తూనే ఉంటుంది.

తెలంగాణ కేవలం ఒక భూభాగం కాదు — అది ఒక భావోద్వేగం. ఆ భావోద్వేగానికి రూపం ఇచ్చిన ఉద్యమ శిఖరం కేసీఆర్ గారు.

ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ సేవ చేసే అవకాశాన్ని పొందాలి అని కోరుకోవడం ప్రతి అభిమాని హక్కు.

చరిత్ర తీర్పు ఒకటే — త్యాగం చేసినవారు నిలుస్తారు…

జాతి కోసం నిలిచినవారు చిరస్థాయిగా నిలుస్తారు.

జయహో తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు 🙏

జై తెలంగాణ జయహో కేసీఆర్ గారు 🔥 - మీ ప్రసాద్ కాసుల ✍️



Wednesday, 18 February 2026

ఈ జీవితంలో మరిచిపోలేని రోజు

కేసీఆర్ సార్ జన్మదినం సందర్భంగా
ఎంతో మంది అభిమానుల మధ్యన
సాయంత్రం ఎర్రవల్లి నివాసంలో కలిశాను
అంత మందిని కలవడం సాధారణ విషయం కాదు
దాదాపుగా వచ్చిన వాళ్లందరినీ కలిసాడు
అనుకున్నంత సులభం అయితే కాదు!
నేను సార్ కి విష్ చేసి వెళ్తుండగా
అంత మందిలో కూడా నవీన్ ఆగు అని పిలిచి
కలుద్దామని లోపలికి వెళ్ళి కూర్చో అన్నాడు
అంతమందినీ కలుస్తూ కూడా
పలకరించి మాట్లాడటం సాధారణ విషయం కాదు!
అందుకేనేమో సార్ దాకా వెళ్లగలిగాను
ఒక చిన్న స్థానాన్ని సంపాదించగలిగాను
అది నాకు ఎంతో గర్వంగా ఉంది
ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నాను! ♥️😍🔥🔥✊✊
ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు
ఈ తరంలో పుట్టడం నా అదృష్టమే
జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన గొప్ప వ్యక్తికి
మరోసారి జన్మదిన శుభాకాంక్షలు! 💐💐😍♥️✊✊
Kallem Naveen Reddy

Saturday, 31 January 2026

'సిట్' పేరిట దాడి సిగ్గుచేటు - కళ్ళెం నవీన్ రెడ్డి - 9963691692

 'సిట్' పేరిట దాడి సిగ్గుచేటు

కళ్ళెం నవీన్ రెడ్డి - 9963691692

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి 

ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ విచారణ పేరుతో నోటీసులు ఇవ్వడం కేవలం వ్యక్తిపై కాదు.. తెలంగాణ ఉద్యమ గౌరవంపై చేసిన దాడి. దీనిని తెలంగాణ సమాజం తీవ్ర ఆవేదనతో సిగ్గుచేటు. చర్యగా ఖండిస్తున్నది. తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రజాస్వామ్య విలువలపై గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఉద్యమ నాయకుడు కేసీఆర్పై అక్రమ కేసులు, నోటీసుల పేరుతో జరుగుతున్న చర్చలు కాంగ్రెస్ పాలనలోని ఆరాచకాన్ని, పాలకుల అసహనాన్ని, రాజకీయ కక్ష సాధింపు చర్యలను స్పష్టంగా బయటపెడుతున్నాయి.

కేవలం ఒక వ్యక్తిపై దాడిగా చూడటమే కాదు. ఇది తెలంగాణ ఉద్యమ చరిత్రపై, ఆ ఉద్యమంలో భాగస్వాములైన లక్షలాది ప్రజల త్యాగాలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా భావించవచ్చు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన రేవంత్ సర్కార్ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతూ ఉద్యమ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తన పాలనలోని

అసమర్థతను, డొల్లతనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది తప్ప మరొకటి కాదు. పాలనా వైఫల్యాలు, అమలు కాని హామీలు, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఎదుర్కోలేని పరిస్థితిలో ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు

దిగుతున్నదని చాలా స్పష్టంగా అర్థం అవుతున్నది. ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన పాలన, విచారణల పేరుతో రాజకీయ వేటకు పాల్పడటం ప్రజాస్వామ్య వ్యవస్థకు

 శ్రేయస్కరం కాదు. కేసుల పేరుతో ప్రతిపక్షాన్ని వేధించడం పాలకుల బలహీనతకు నిదర్శనం.

తెలంగాణ సాధన ఒక రాజకీయ అవకాశవాదం కాదు. అది ఒక తరం త్యాగాల ఫలితం. ఆ పోరాటానికి నాయకత్వం వహించిన కేసీఆర్ పేరు చరిత్రలో ఒక వ్యక్తిగా మాత్రమే కాదు, ఒక ఆలోచనగా, ఒక ఉద్యమంగా, సిద్ధాంతంగా నిలిచిపోతుంది. అటువంటి నాయకుడిపై కక్షపూరిత

చర్యలకు, వేధింపులకు పాల్పడటం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆత్మగౌరవాన్ని

అవమానిస్తున్నదనే భావన, ఆగ్రహం ప్రజల్లో

బలంగా నెలకొన్నది.

కేసీఆర్ అనే ప్రజానాయకుడు పదవుల కోసం ఆరాటపడలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం తన పదవులను కూడా తృణప్రాయంగా విసిరి పారేసిన విషయాన్ని మననం చేసుకోవాలి. టీ ఆర్ఎస్ స్థాపన నుంచి రాష్ట్ర సాధన వరకు ఆయన చేసిన ప్రయాణం మహత్తర పోరాట ప్రస్థానం.

ప్రజల నుంచి పుట్టిన నాయకుడు కావడం వల్లే ఆయన బలం అధికారంలో కాదు, ప్రజల విశ్వాసంలో ఉన్నది. అందుకే కాంగ్రెస్ కక్షసాధింపు రాజకీయాలు ఆయనను బలహీనపరచలేవు.

చరిత్రను మరిచిపోవాలని, ఉద్యమాన్ని చిన్నచూపు చూడాలని ఎవరైనా యత్నిస్తే ప్రజాతీర్చు నుంచి తప్పించుకోలేరు. కుట్రలతో పాలన సాగించవచ్చు అని అనుకుంటే భ్రమ. తెలంగాణ

ఉద్యమ చరిత్ర, కేసీఆర్ నాయకత్వం ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయిన

సత్యాలు, కాంగ్రెస్ పాలకులు చరిత్రను గౌరవించకపోతే ప్రజాగ్రహం తప్పదు.


Saturday, 3 January 2026

మళ్ళీ ఎప్పటిలాగే

మళ్ళీ ఎప్పటిలాగే! 
మళ్ళీ ఎప్పటిలాగే ప్రతీ సంవత్సరం 
అనేక సంఘర్షణలను మోస్తూ 
మరో సంవత్సరానికి ఆహ్వానం 
పలుకుతూనే ఉన్నాను! 
జీవితంలో నేర్చుకోవాల్సిన అంశాలను, 
గమనించాల్సిన అంశాలను 
నా చుట్టూ ఉన్నటువంటి 
మనిషి తనపు అన్ని కోణాలను 
అద్దం లేకుండానే చూసే 
స్థాయికి నన్ను తీసుకెళ్లింది కాలం! 
నిత్యం జీవితాన్ని అందంగా చెక్కుకుంటూ 
ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు 
సిద్ధమై అనుకున్న లక్ష్యాల కోసం వ్యవస్ధలో 
మమేకమై ప్రయాణిస్తూనే ఉన్నాను! 
రానున్నవి మంచి రోజులు గడిచిన 
కాలంలోని అనుభవాలు 
నేర్పించిన గాయాలు, జ్ఞాపకాలు 
మాత్రమేనని ఇలాగే సాగుతూ ఉన్నాను! 
జీవితం అంటే సంతోషం కోసం పరుగెత్తడం కాదు 
బాధలో కూడా నిలబడగలగడం 
ఎన్నో ఏళ్లుగా ఇదే నేర్చుకున్నాను! 
గడిచిన కాలం నాకు మిగిల్చింది 
గాయాల్ని కాదు గాయాల్ని భరించే గొప్ప సామర్థ్యాన్ని…! 
గడిచిన కాలం నా నుండి వెంట తీసుకెళ్లింది కొన్ని గాయాలు, 
కొన్ని జ్ఞాపకాలు, కొన్ని మౌనాలు మాత్రమే.... 
అవి ఇక బాధ పెట్టవు ఎందుకంటే అవి నన్ను నిలబెట్టిన నా కథలే…! మళ్ళీ ఎప్పటిలాగే #byebye2025 - Kallem Naveen Reddy

నిందలు .. చిందులు.. కళ్ళెం నవీన్ రెడ్డి

నిందలు .. చిందులు.. కళ్ళెం నవీన్ రెడ్డి నమస్తే తెలంగాణ 01-01-2026 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంవత్సరమే పాలనా దిశను నిర్ణయిస్తుంది. ఆ కాలంలో తీసుకున్న నిర్ణయాలు, అమలుచే సిన విధానాలు, చూపిన పరిపాలనా శైలి ప్రజల నమ్మకానికి పునాది అవుతాయి. కానీ, తెలంగాణలో ప్రస్తుతం కనిపిస్తున్న పాలనా పరిస్థి తులను చూస్తే, సమస్యల పరిష్కారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ సమర్థ తపై ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. నిందలు.. చిందులు! కళ్ళెం నవీన్ రెడ్డి 99636 91692 రాష్ట ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన చిత్రాన్ని ప్రజలకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని వస్తున్న విమర్శలు సహేతుకమైనవే. అప్పులు, ఆదాయ వనరులు, ఖర్చుల ప్రాధాన్యాలు ఈ అంశాల్లో పారదర్శత కొరవడటం అనిశ్చితిని పెంచుతున్నది. సమస్యను గుర్తించడం ఒక దశ అయితే, దానికి సరైన కార్యాచరణ రూపొందించడం అసలు పరీక్ష, ఆ పరీక్షలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయిందని రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారు. రైతాంగ సమస్యలు తెలంగాణకు మూలస్తంభం వంటివి. సాగునీరు, ఎరువులు, పెట్టుబడి సాయం, పంటలకు గిట్టుబాటు ధర రైతు జీవితానికి సంబంధించిన వాస్తవాలు. అయితే రైతు సమస్యలపై తీసుకున్న చర్యలు తాత్కాలికంగా కనిపిస్తున్నాయి తప్ప, దీర్ఘకాలిక పరిష్కారాలుగా మారలేకపోతున్నాయి. నిరుద్యోగ యువత పరిస్థితి మరింత అందోళన కలిగిస్తున్నది. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఉద్యో గాల భర్తీపై ఇచ్చిన హామీలుగానే ఇచ్చినట్టే ఉన్నాయి. ప్రకటనల కోసం యువత ఎదిరిచూస్తున్నది. ఈ పరిస్థితిలో పాలనపై ప్రజల్లో నమ్మకం దెబ్బ తిన్నది. పరిపాలనలో స్థిరత్వం కూడా ఒక కీలక అంశం. తరచూ మారుతున్న ప్రకటనలు, విభిన్న వ్యాఖ్యలు, ఒకదానికొకటి పొంతన లేని నిర్ణయాలు ప్రభుత్వ దిశపై సందేహాలు కలిగిస్తున్నాయి. విమర్శలకు సమాధానంగా విమ ర్శలే చేయడం పాలనకు ప్రత్యామ్నాయం కాదు. ప్రజలు కోరేది స్పష్టమైన విధానం, స్థిరమైన నిర్ణయాలు. కానీ ప్రభుత్వం ఈ సోయి మరిచిపోయి వ్యవ హరిస్తున్నది. నాయకత్వం అంటే సమస్యలకు ఇతరులపై నిందలు వేయడం, చిందులు వేయడం కాదు, బాధ్యతగా వ్యవహరించడం. గత ప్రభుత్వాలపై ఆరోపణలు చేస్తూ కాలం గడిపితే వర్తమాన సమస్యలకు పరిష్కారం దొర కదు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతుల దూకుడు తగ్గించుకొని, పాలనలోని లోతులను తెలుసుకోవాలి. సమర్థతను కార్యాచరణ ద్వారా నిరూపించుకోవాలి. పనిలో నిమగ్నమైనప్పుడే బూతు మాటలు నోటి నుంచి రాకుండా ఉంటాయి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే.. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఏ ప్రకటన చేస్తాడో అని ప్రజలు వేచిచూసే సమయం రావాలి. అది రేవంత్ జీవితంలో సాధ్యమయ్యే పనికాదు.

Saturday, 20 December 2025

నాకేం మేలు జరిగిందో కాదు

ఈ తాత్కాలికమైన జీవితంలో
మనిషి అనేవాడు
తనను తాను
నిరూపించుకునే ఆరాటంలో
ఇతరులను తక్కువ చేస్తూ ఉంటాడు
అహం అతని కవచమవుతుంది
ద్వేషం అతని ఆయుధమవుతుంది
కానీ అవే
తన ఆత్మను నెమ్మదిగా
చీల్చి వేస్తున్నాయని
అతనికి అర్థం కాదు!
ఎందుకు జన్మించాడో తెలియదు
ఎవరికి ఉపయోగపడాలో అనేది మరిచి
వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా
నిత్యం దాన్ని దిగజార్చుకుంటూ
ఎవరి మీద గెలవాలో
ఆలోచిస్తూ ఉంటాడు!
చివరికి
ఈ శ్వాస కూడా అద్దెదే అని
ఈ దేహం కూడా ప్రయాణికుడే అని
అర్థమయ్యేసరికి
కాలం తన ఖాతా మూసేస్తుంది!
మనిషిగా పుట్టడం యాదృచ్ఛికం
కానీ మనిషిగా జీవించడం మాత్రం
మన చేతుల్లోనే ఉన్న భాధ్యత!
- Kallem Naveen Reddy

Wednesday, 17 December 2025

మనల్ని చాలామంది చాలా సింపుల్‌గా అనుకుంటారు లెక్కలోకి కూడా తీసుకోవడానికి వాళ్ళ వ్యక్తిత్వం సరిపోదు#- Kallem Naveen Reddy

 మనల్ని చాలామంది

చాలా సింపుల్‌గా అనుకుంటారు

లెక్కలోకి కూడా తీసుకోవడానికి

వాళ్ళ వ్యక్తిత్వం సరిపోదు

అది మన బలాన్ని
అంచనా వేయలేని
వాళ్ల పరిమితి మాత్రమే!
మనం ఎంత దూరం వెళ్లామో
ఎన్ని అగ్నిగుండాలు దాటామో
ఎంత గొప్ప ప్రయాణం చేశామో
వాళ్ల కళ్లకు కనిపించిన
కనిపించనట్టు ఉంటారు
సింపుల్‌గా ఉండటమనేది
మన బలహీనత కాదు
అది మన లోతు
మన స్థాయి...!
నిశ్శబ్దంగా ఉండటం
మన అలవాటు
శబ్దం చేయకుండా
చరిత్ర రాయడం మన స్వభావం
ఎక్కడికెళ్లినా నేల వాసన మర్చిపోం
గెలిచినా వినయం విడిచిపోం
ఓడిపోయిన కుంగిపోం
ఇంకా బలంగా కొట్లాడుతాం!
మన ప్రయాణం మనకే తెలుసు
మన విలువ కాలానికే తెలుస్తుంది
మనం మాత్రం ఎప్పటిలాగే
సింపుల్‌గానే ముందుకు సాగుదాం!
- Kallem Naveen Reddy


Monday, 15 December 2025

నేను మాత్రమే కాదు

 

నేను మాత్రమే కాదు నాలాంటి వాళ్ళెందరో బీఆర్ఎస్

అనే కుటుంబాన్ని నమ్ముకుని బతుకే అర్పించినవాళ్లం

మీ మీ స్వార్థ ప్రయోజనాల కోసం

మాలాంటి వాళ్ళను ఆగం చేయకండి!

చేతుల్లో జెండా పట్టుకున్నాం

గుండెల్లో తెలంగాణను నిలుపుకున్నాం

అవమానాలు ఎదురైనా

వెనుదిరగని వాళ్ళం

రాత్రులు మాకెన్నో నిద్రలేకుండా గడిచాయి

ఇళ్లలోకాదు ఆశల అగ్నిలోనే మేము పెరిగాం

బీఆర్ఎస్ కూలిపోతుందంటూ

కలలు కంటున్నవాళ్లకు

ఒక్కటే సమాధానం

త్యాగాల చరిత్రకు

పతనం ఉండదు!

మా పార్టీ ఓ భవనం కాదు

కూల్చడానికి

అది ఓ భావజాలం

చెరిపేయడానికి వీలుకాదు

ప్రతి కార్యకర్త గుండెల్లో

ఒక ఉద్యమం బతుకుతోంది

ఆ ఉద్యమాన్ని

నాశనం చేయాలని కోరుకోవడమే

వాళ్ల జీవితంలో నెరవేరని

అతిపెద్ద పగటి కల!

తెలంగాణ శ్వాస ఉన్నంతవరకు

బీఆర్ఎస్ స్ఫూర్తి ఆగదు

పోరాటం ఆగదు

చరిత్ర ముందుకు నడుస్తూనే ఉంటుంది!

ఎందుకంటే

త్యాగాల మీద నిలిచిన పార్టీని

కక్షలతో కూల్చలేరు

ప్రజల గుండెల్లో నాటుకున్న వృక్షాన్ని

విషపు మాటలతో ఎండబెట్టలేరు!

- Kallem Naveen Reddy

Sunday, 12 October 2025

మౌనమూ శబ్దమూ!

మౌనమూ శబ్దమూ! మీ శబ్దాలన్ని మౌనాలౌతాయి కాల గమనం వాటిని మింగేస్తుంది మీ శబ్దాలన్ని శూన్యాలౌతాయి ఆత్మరహిత ప్రతిధ్వనులై మిగిలిపోతాయి మా మౌనాలన్ని శబ్దాలౌతాయి మనసు లోతుల్లో పెల్లుబికే పిడుగులవుతాయి మా మౌనాలన్ని ప్రకాశిస్తాయి నిజం రూపంలో వెలుగులు పూస్తాయి అనేక సందర్భాలలో నిశ్శబ్దమే మా భాష అది మాటల కంటే గంభీరమైన స్వరం అది కాలం చెరపలేని సత్యమై నిలుస్తుంది! Kallem Naveen Reddy

Thursday, 9 October 2025

భగవద్గీత సారాంశము

 పరమాత్మనేనమః                                                                            

శ్రీ గురుధ్యానము:

                                              భగవద్గీత సారాంశము



వ్యర్థంగా ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు అనవసరంగా భయపడుతున్నావు? ఎవరు నిన్ను చంపగలరు? ఆత్మకు చావులేదు, పుట్టుకాలేదు జరిగిన దానిగురించి బాధ, జరిగిందీ, జరుగుతున్నదీ, జరగబోయేదీ, అంతా మన మంచికే. జరగబోయే దాని గురించి  ఆతృతావద్దు. జరుగుతున్న వర్తమానం మీద శ్రద్ధ వహించు. నీదేమి పోయిందని దుఃఖిస్తున్నావు? వెంట ఏమి తెచ్చావని నీవు పోగట్టుకున్నానని బాధ

పడడానికి ? నువ్వేం ఉత్పత్తి చేసావు, అది నాశనమైందని చింతించడానికి ? నువ్వేమీ వెంట తీసుకుని రాలేదు. సంపాదించిందేదో  ఇక్కడే సంపాదించావు ఇవ్వడం కూడా ఇక్కడి వారికే ఇచ్చావు అంతేకాదు, తీసుకున్నది కూడా, 


పరమాత్మ దగ్గర నుంచే తీసుకున్నావు. ఇవ్వడం కూడా, పరమాత్మకే ఇచ్చావు. ఖాళీ చేతులతో, వచ్చావు, తిరిగి ఖాళీ చేతులతోనే వెళ్తావు. ఈ రోజు నీదనకుంటున్నది, నిన్న వేరొకరిది, మొన్న ఇంకెవరిదో. దీనిని నీదనుకుని మురిసి పోతున్నావు. ఈ ఆనందమే, నీ దుఃఖాలకు మూలం. మార్పు జీవన సిద్ధాంతం. నీవు మృత్యువని భావిస్తున్నావే, నిజానికి అది జీవితం. ఒక్క క్షణంలో నీవు కోటిశ్వరుడవు కాగలవు, మరుక్షణంలో దరిద్రుడవూ కాగలవు. నాది. నీది, చిన్న, పెద్ద, స్వపర వంటి భేద భావాల్ని తొలగించుకో, అప్పుడు అన్నీ నీవిగా, అందరూ నీవారుగా, నీవు అందరికీ చెందిన వ్యక్తిగా భావించుకో గలుగుతావు.


ఈ శరీరం నీది కాదు, నువ్వీ శరీరానికి చెందిన మనిషివీ కాదు. ఈ శరీరం అగ్ని, నీరు, గాలి, మట్టి, ఆకాశం - వీటితో తయారైంది. తిరిగి వాటిలోనే ఐక్యమైపోతుంది. కాని, ఆత్మ శాశ్వతమైనది,

మరి నీ వెవరు ?

నిన్ను నీవు పరమాత్మకు అర్పితం చేసుకో. ఇదే నీకు సర్వోత్తమమైన ఆధారం. ఇది తెలిసినవారికి భయము, చింత, దుఃఖము కలుగవు..

నీవు చేసే ప్రతి పనినీ ఈశ్వరార్పితం చెయ్యి. ఇలా చేయడం వలన నీకు సదా జీవన్ముక్తికి సంబంధించిన అనందం కలుగుతుంది.

(కృష్ణం వందే జగద్గురుమ్)


Wednesday, 1 October 2025

పరిత్రాణాయ సాధూనాం


అవ్యక్తం వ్యక్తం

అవ్యక్తంగా అనంతుడైన భగవంతుడు వ్యక్తం కావడమే అవతారము. భగవంతుని అవతారములో అనంతమైన కారుణ్యమే ప్రధానంగా గోచరిస్తుంది. ఒక్క విషయాన్ని అర్థం చేసుకుందాం. మన శరీరంలో భగవంతుడు లేని దెక్కడ? అలాగని అన్ని చోట్ల ధ్యానించ గలమా? హృదయంలోనే ధ్యానిస్తాం. ధ్యానానికి హృదయం ఉపలబ్ధి స్థానం. హృదయంలో ధ్యానం సాగుతుంది. హృదయం లోనే దైవదర్శన మవుతుంది. అంతమాత్రాన పరమేశ్వరుడు దేహంలో హృదయానికే పరిమితం అని భావించ గలమా? అంతే. దేహమంతా నియతి రూపంలో శోభిస్తున్న పరమేశ్వరుని, హృదయంలో ధ్యానించిన వారికి హృదయంలో దర్శన మిస్తాడు. అదే ఆయన కారుణ్యం.

విశ్వంలో ఈశ్వరుడు లేని దెక్కడ? విశ్వమంతా తానే నిండి నిబిడీకృతమై ఉన్నాడు. బ్రహ్మ ఏవ ఇదం విశ్వం. ఈ విశ్వమంతా బ్రహ్మమే. వివిధ ప్రత్యయ గమ్యంగా రూప శబ్దాదులతో విశ్వం గోచరిస్తూ ఉంటే, దేనికీ దూరం కాకుండా, దేనికీ అంటకుండా అభిన్న నిమిత్త ఉపాదాన కారణమైన భగవంతుడు విశ్వానికి విలక్షణంగా శోభిస్తున్నాడు. అలాంటి దివ్యాత్ముడ్ని కళ్ళు దర్శించ గలవా? దర్శించ లేవు. కనుక, బుద్ధితో చూడాలి. అవ్యక్తు డైన పరమాత్మ జ్ఞానరూపంలో బుద్ధికి అందుతాడు. తానే వ్యక్త మైతే కళ్ళకు కూడా కనిపిస్తాడు.

ధర్మ రూపంలో అవ్యక్తంగా శోభించు వాడు, దివ్యదేహధారిగా వ్యక్తమై ప్రకాశించడమే అవతారము.

ఎవరు అవతరించినా, ఏది అవతరించినా వచ్చిన పనిని చక్క పెట్టుకొని వెళ్ళేందుకేనని ఇంతకుముందే తెలుసుకున్నాం. మరి, భగవంతుడు అవతరించి నపుడు ఏయే కార్యాలు జరుగుతాయి? ఏయే ప్రయోజనాలు సిద్ధిస్తాయి?

పని ఒక్కటే ఫలితాలు మూడు

భగవంతుడు అవతరించడం అనే ఒక్క అద్భుత కార్యానికి మూడు ప్రయోజనాలు దివ్యంగా సిద్ధిస్తాయి.

అవి (1) సాధు పరిరక్షణము (2) పాప వినాశము (3) ధర్మ సంస్థాపనము.

అవతారము అందించే ఫలితాలు మూడుగా తెలుస్తున్నా, ఈ మూడింటిలో ఏ ఒక్కటి సిద్దించినా, మిగిలిన రెండూ సిద్దించినట్లే. ఈ సత్యాన్ని చివర అర్థం చేసుకుంటాం. ముందుగా ప్రయోజన క్రమాన్ని వంట పట్టించుకుందాం.

(1) సాధు పరిరక్షణము

సాధుః అంటే మంచివాడు (సజ్జనః) సన్మార్గములో చరించే వాడు సాధువు, లేదా సజ్జనుడు. అలాంటి వారిని పరిరక్షించడం అవతార ప్రయోజనాలలో మొదటిది. సన్మార్గంలో చరించేవారు సాధువులు కనుక, అలాంటి సాధువులను పరిరక్షించడమే సాధు పరిరక్షణము (సాధూనాం సన్మార్గస్థానం. పరిత్రాణాయ పరిరక్షణాయ)

సన్మార్గంలో ప్రవర్తించే వాళ్ళు సాధువులు, అయితే ఏది సన్మార్గము? ఎవరి మార్గము వారికి సన్మార్గముగానే కనిపిస్తుంది. లేకపోతే, ఇన్ని మతాలు ఎలా పుట్టుకొచ్చాయి? సన్మార్గము అంటే ధర్మమార్గము. ఏది ధర్మమార్గము? ఒకొక్క కాలానికి ఒకొక్క ధర్మము, ఒకొక్క దేశానికి ఒకొక్క ధర్మము, ధర్మనిర్ణయం ఇదమిత్థంగా తేలే విషయ మేనా? ఇదంతా వ్యావహారిక ధర్మము, ఇక్కడ ధర్మము అంటే, న్యాయము లేదా నియతి అని అర్థం చేసుకోవాలి. ఈ సృష్టిలో నియతి ఉంది. అదే ఇక్కడ ధర్మం. ధర్మరూపంలో ఉన్నది దైవమే. ధర్మమార్గంలో ప్రవర్తించడము అంటే దైవమార్గంలో సయనించడ మని అర్థము. నియతిని అనుసరిస్తూ జీవించేవాడు సాధువు (న్యాయవర్తీ సాధు  ). కనుక సాధువులు అంటే సన్యాసులు అని కాదు. ధర్మజీవనం సాగించే వారు అని అర్థము. సన్యాసులు ధర్మజీవనాన్ని సాగిస్తారు. కాని, ధర్మజీవనంలో ప్రయాణం చేసే వాళ్ళందరూ సన్యాసులు కానవసరం లేదు.

మరి, న్యాయవర్తులైన సాధుజనులు ధర్మమార్గాన చరిస్తూనే ఉంటారు కదా! అలాంటి వారిని పరిరక్షించవలసిన అవసరం ఏమిటి? వారికి మార్గంలో రక్షణ కరువై ఉండాలి. భద్రత లోపించి ఉండాలి. సాధువుల అభద్రతకు ఎవరు కారణమై ఉంటారు? సాధువులకు అభద్రతను, అవరోధాలను కలిగించేవారు అసాధువులై ఉండాలి. పాపాత్ములై ఉండాలి. సాధువులను పరిరక్షించే పవిత్రకార్యంలో పాపులను నిర్మూలించ వలసిన అవసరం ఉంది కనుక, ఇది అవతార వైభవంలో ప్రాప్తించే రెండవ ప్రయోజనము, దుష్కృతులైన పాపాత్ములయొక్క (పాపకారిణాం) వినాశము (వినాశాయ) అవతారము యొక్క రెండవ కార్యము..

పాప వినాశము

పాపకార్యాలు ఆచరించే వాళ్ళను నశింప చేయడమంటే పాపాన్ని నశింప చేయడమని అర్థము. నశింపబడేది పాపికాదు. పాపము. సాధు పరిరక్షణము ఎంత అవసరమో, పాపి వినాశము కూడా అంతే అవసరము. ధర్మమార్గంలో అవరోధంగా మారిన పాపులను తొలగించక పోతే, సాధుజీవనము ముందుకు సాగదు. సాధుజీవనం కుంటుపడితే, సమాజం కుదుట పడదు. సమాజ అభ్యుదయం సాధుజీవనంపై ఆధారపడి ఉంది కనుక, సాధుజీవనానికి ఆటంకంగా తయారైన పాపుల్ని ఏరి వేయాలి. తీసి దూరంగా పారేయాలి.

దేహంలో ఒక అవయవం కుళ్ళిపోతే, ఆ దుష్టాంగాన్ని వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగిస్తారు. అలా చేస్తేనే, వ్యక్తి బ్రతుకుతాడు, ఒకవేళ దుష్టాంగాన్ని తొలగించకుండా, అలాగే ఉంచితే దేహమంతా కుళ్ళిపోయే ప్రమాదం, తద్వారా మరణ ప్రాప్తి కలుగ వచ్చు. కనుకనే, వైద్యుడు దుష్టాంగాన్ని నిర్మూలించినట్లు, నారాయణుడు వైద్యుని పాత్రను పోషించి, సమాజం లోని పాపాన్ని నిర్మూలించి అభ్యుదయాన్ని ఆరోగ్యప్రదంగా ఉంచుతాడు. అట్టి సమాజంలో ధర్మం శోభిస్తుంది. ధర్మజీవనం దివ్యంగా ప్రకాశిస్తుంది.

ధర్మ సంస్థాపనము

ధర్మమును చక్కగా స్థాపించడమే ధర్మ సంస్థాపనము (ధర్మస్య సమ్యక్ స్థాపనం), ధర్మమును స్థాపించడము అంటే ధర్మమును స్థిరీకరింప చేయడము లేదా రక్షించడము అని అర్థము. ధర్మమును రక్షించడము అంటే, ధర్మమును ఆచరించే ధర్మాత్ములను రక్షించడము అని భావము. ధర్మాత్ములను రక్షించడము అంటే, ధర్మాత్ముల ధర్మజీవనాన్ని ఆటంకపరచే అధర్మపరులను శిక్షించడమని అర్థము. అధర్మపరులే పాపులు. వారు ధర్మమును అనుష్టించరు. పైగా అధర్మములో చరిస్తారు. వారు అధర్మములో చరించడమే గాక ధర్మమార్గాన చరించే వారికి అవరోధంగా తయారవుతారు. కనుకనే ధర్మ సంస్థాపనము అనే పవిత్ర కార్యంలో శిష్ట రక్షణముతో పాటు దుష్టశిక్షణము కూడా జరుగుతుంది. ఇదంతా అవతార కార్యము.

ధర్మరూపంలో ఉన్నది దైవమే కనుక, సర్వధర్మాలు పరమేశ్వరునే ఆశ్రయించుకొని ఉన్నాయి. ధర్మము ధర్మికన్నా వేరుగా ఉండలేదు. సృష్టి లోని ధర్మాలను వీక్షించినపుడు మన బుద్ధిలో ధర్మి లేక పరమేశ్వరుడు ప్రకాశిస్తాడు. అలాగే పరమేశ్వరుడు అవతరించినపుడు, ధర్మియైన ఆ దివ్యాత్ముని ప్రతి కదలికలో ధర్మమే. గోచరిస్తుంది. శ్రీరాముడు అవతరించాడు. ధర్మమును తాను స్వయంగా ఆచరించి చూపాడు (ధర్మం కరోతి). ఇతరులు ఆచరించడానికి ఆదర్శమయ్యాడు (ధర్మం కారయతి), ఇదంతా అవతార కార్యంలో దివ్యంగా సాగే ధర్మసంస్థాపనము.

సవరించడమా? సంస్కరించడమా?

ధర్మ సంస్థాపనము అంటే, ధర్మమును సవరించడము అని కూడా కొందరు భావిస్తారు. ఇది చాలా తప్పు. దేశకాలాదులలో నిరుపయోగంగా మారిన ధర్మాన్ని కాలానుగుణంగా సవరించి, స్థాపించడము ధర్మసంస్థాపనము అని వారి అభిమతం. ఇలాంటి మహత్తరమైన కార్యమును సామాన్యులు చేయలేరు కనుక, భగవంతుడే స్వయంగా అవతరించి ఆ కార్యాన్ని పూర్తి చేస్తాడని వారి విశ్వాసము.

ఇలాంటి వ్యాఖ్యానాలు శాస్త్ర హృదయం తెలియని వారికి వినసొంపుగానే ఉంటాయి. ఈ విధమైన దోషపూరిత వ్యాఖ్యలు ఎంత అయోమయాన్ని సృష్టిస్తాయో శాస్త్రవిదులకే తెలుసు. ధర్మాన్ని సవరించడానికి దైవం అవతరించడమే వాస్తవ మైతే, మరి, అవతారమూర్తి సవరించే ధర్మాన్ని సృష్టించిం దెవరు? భగవంతుడే కదా! మరి ధర్మాన్ని సృష్టించిన దైవానికి (ధర్మకృత్), లేదా ధర్మరూపంలో ఉన్న దైవానికి ధర్మం విషయంలో పూర్ణజ్ఞాన ముందా, లేదా? పూర్ణపురుషుడు, పురుషోత్తముడు ఏర్పరచిన ధర్మానికి కాలదోషం పడుతుందా? పడితేనే కదా సవరించాలి? సవరించడానికి అవతరించిన భగవంతుడు, ధర్మమును సృష్టించిన భగవంతుని కన్నా వేరైన వాడా? వేరైతే వీరిరువురిలో భగవంతు దెవరు? ఒక్కరే అయితే, పూర్ణ జ్ఞానమున్నవాడు కాలదోషం పట్టే ధర్మాన్ని సృష్టిస్తాడా ? ధర్మానికి కాలదోషం పడితే, ధర్మరూపంలో ఉన్న దైవానికి

కూడా కాలదోషం పట్టినట్లే కదా? అలాంటి భగవంతుడు ఒకవేళ నేడు అవతరించి ధర్మాన్ని సవరిస్తే, అదే ధర్మము భవిష్యత్తులో నిరుపయోగం కాదని చెప్పగలమా? భవిష్యత్తు అంటే ఏమిటి? తరువాత క్షణము కూడా భవిష్యత్తు క్రిందికే వస్తుంది కదా! ఇలా ఏ క్షణమైనా క్షీణించే ధర్మాన్ని సవరించడానికి భగవంతుడు అవతరించవలసిన అవసరం ఉందా? కొద్దిగా ఆలోచించ గలిగితే ఈ సవరణవాదులు సంస్కరింప బడుతారు.

సవరింప బడటానికి ధర్మ మనేది రాజ్యాంగము కాదు. పరిమిత జ్ఞానము కలవారు సృష్టించింది కాదు. త్రికాల జ్ఞావము లేనివారు తయారు చేసింది కనుక, రాజ్యాంగము కాలానుగుణంగా అనేక సవరణలతో నూతన రూపాన్ని ధరిస్తూ ఉంటుంది. సర్వజ్ఞుడైన పరమేశ్వరునికి సంబంధించిన జ్ఞానము పూర్ణజ్ఞానము కనుక అది సవరణలకు వీలు కాదు. కనుక ధర్మ సంస్థాపనము అంటే, నిరుపయోగ మైన ధర్మాన్ని రాజ్యాంగాన్ని సవరించినట్లు సవరించడం కాదు. ధర్మాన్ని ఉపయోగించుకోలేని సమాజాన్ని ధర్మాన్ని ఆచరించేలాగా సంస్కరించడమే. కనక ధర్మసంస్థాపనము అంటే, ప్రజలు ధర్మాన్ని ఆచరించేలా చేయడమే. ఆచరించ వలసింది ధర్మము. ఆచరించ కూడనిది అధర్మము. ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరించక పోవడమే గాక, ఆచరించ కూడని అధర్మాన్ని ఆచరించడం వల్ల సమాజం ధర్మజీవనానికి దూరమౌతుంది. ధర్మానికి దూరమైన సమాజము దగా పడుతుంది. నశించి పోతుంది. ఈ పరిస్థితిని చక్క చేయాలి అంటే సర్వజనులు ధర్మ మార్గంలో చరించేలా చూడాలి. ఈ విధమైన మంగళకార్యాన్ని నిర్వర్తించడానికే భగవంతుడు అవసరాన్ని బట్టి రూపం. ధరించి అవనిపై అవతరిస్తాడు. అవతారమూర్తి స్పూర్తితో అధర్మపరులు కూడా ధర్మమూర్తులై శోభిస్తారు. ఈ పవిత్రమైన కార్యాన్ని నిర్వర్తించడానికే తాను ప్రతి యుగం లోను అవతరిస్తూ ఉంటాను అంటున్నాడు.

(తధర్ధం సంభవామి యుగే యుగే ప్రతియుగమ్). యుగమంటే కాలం

ప్రతి యుగంలోను తాను అవతరిస్తూ ఉంటాను అన్నాడు భగవంతుడు. అంటే, అవతార మనేది. కేవలం ఆ యుగంలోనే రావాలి అని లేదు. ఏ యుగంలోనైనా రావచ్చు. అంతేకాదు, ప్రతి యుగంలో తప్పకుండా రావాలి అని కూడా లేదు. అవసరాన్ని బట్టే అవతారము. మనం నిర్మించుకున్న గృహం పాడైతే మనం బాగు చేసుకుంటాము. ఎప్పుడు బాగు చేసుకుంటాము? ఎప్పుడు అవసరమొస్తే అప్పుడు బాగు చేసుకుంటాము. ఇదీ అంతే.

సమాజానికి సరియైన ధర్మబోధలు అందుతున్నంత కాలం ప్రజలు ధర్మాన్ని అనుష్టిస్తూనే ఉంటారు. ధర్మాచార్యులు, సాధుపురుషులు సన్మార్గాన్ని నిర్దేశిస్తున్నంత కాలం ధర్మజీవనాన్ని జనులు కొనసాగిస్తూనే ఉంటారు. బోధలు అందక పోయినా, లేదా దుర్బోధలు బోధల రూపంలో వ్యాప్తి చెందినా ప్రమాదం వాటిల్లుతుంది. సమాజం ధర్మం విషయంలో సందిగ్ధంలో పడి పోతుంది. ఇలాగే చాలా కాలం కొనసాగితే సమాజం ధర్మం విషయంలో నిర్వీర్యమై నిస్సార మవుతుంది. ఇదే ధర్మగ్లాని. ఇలా భయంకరంగా, చీభత్సంగా తయారైన సమాజాన్ని మరల ధర్మవృక్ష ఛాయలో నిలిపేందుకు మాధవుడు మానవుడై అవతరించి, అనితర సాధ్యంగా ధర్మ సంస్థాపనము గావిస్తాడు.

త్రాణం అంటే రక్షణము. సాధురక్షణము అనే మొదటి ప్రయోజనములో 'త్రాణాయ' అంటే సరిపోతుంది. కాని, 'పరిత్రాణాయ' అన్నాడు భగవంతుడు. 'పరి' అనే ఉపసర్గతో పలికి ఏ ఒక్కరినో కాకుండా అందరినీ రక్షించడం అంతటా రక్షణ నెలకొల్పడం జరుగుతుందని సూచించారు (పరితః త్రాణమ్). నాశః అంటే నాశము. దుష్ట శిక్షణము అనే రెండవ ప్రయోజనములో 'నాశాయ' అంటే సరిపోతుంది. కాని, భగవంతుడు 'వినాశాయ' అన్నాడు. నాశము అంటే నశించడం అని అర్థము. వినాశము అంటే సమూలంగా, కారణ సహితంగా నశించడము అనే అర్థాన్ని సూచిస్తూ 'వినాశాయ' అన్నాడు. స్థాపనము అంటే స్థాపించడం. ధర్మ సంస్థాపనము అనే మూడవ ప్రయోజనములో 'స్థాపనార్థాయ' అంటే సరిపోతుంది. కాని 'సంస్థాపనార్థాయ' అన్నాడు భగవంతుడు, 'సం' అంటే సమ్యక్ అని అర్థం. అంటే, బాగుగా, చక్కగా అని భావము, అనంతుడు అవతారమెత్తినపుడు ధర్మం పూర్ణంగా స్థాపింప బడుతుంది అనే అర్థాన్ని సూచిస్తూ 'సంస్థాపనార్థాయ' అన్నాడు.

ఆఖ్యాయిక 

పూర్వం ఒక రాజు గారికి భగవంతుడు అవతరించడం అనే విషయం అస్సలు నచ్చేది కాదు. భగవంతుదేమిటి, అవతరించడం ఏమిటి? విశ్వంలో ధర్మాన్ని చక్కబెట్టాలి అనుకుంటే, ఆయనే దిగిరావాలా? రాజ్య పరిపాలనలో తనకే ఎందరో సహకరించి తన ఆజ్ఞలను పాటిస్తూ, పరిపాలనా వ్యవహారాలను చక్కబెడుతున్నప్పుడు, ఈ విశ్వ యంత్రాంగంలో పరమేశ్వరుని ఆజ్ఞలను పాటించే వారే లేరా? అని వితండంగా వాదిస్తూ ఉండేవాడు. ఆయన వాదన ఎవ్వరికీ నచ్చక పోయినా, ప్రభువు కావడం చేత ఎవ్వరూ ప్రతివాదం. చేసేవారు కారు. మంత్రిగారు మంచి భక్తుడు. నైష్ఠికుడు. శాస్త్ర పాండిత్యం కలవాడు. రాజుగారి వైఖరి తనకు నచ్చకపోయినా, తనలో తాను మధన పడేవాడే గాని రాజు గారిని వారించే వాడు కాదు. సాయంత్రాలలో గంగానదిలో నౌకా విహారం చేయడం రాజుగారికి సరదా. మంత్రి గారిని, కొందరు పండితులను నావలో ఎక్కించుకొని శాస్త్ర చర్చ చేస్తూ విహరించడం అలవాటు. ఒకరోజు సాయంత్రం అందరూ కలిసి నదిలో నౌకా విహారం చేస్తూ ఉన్నారు. శాస్త్ర చర్చ జరుగుతూ ఉంది. ఇంతలో ఆ నౌక లోనే తమతో పాటు విహరిస్తున్న రాజుగారి ఐదేళ్ళ కుమారుడు పట్టు తప్పి నదిలో పడి పోయాడు.

అయ్యో, అయ్యో! బాబు పడిపోయాడు! అంటూ మంత్రి బిగ్గరగా అరిచాడు. అంతే, వెంటనే రాజుగారు నది లోకి దూకి, మునిగి పోతున్న కుమారుణ్ణి ఎత్తుకొని, ఈదుకుంటూ వచ్చి నావ నెక్కాడు. తీరా చూస్తే, రాజుగారి చేతిలో ఉన్నది పిల్లవాని ప్రతిమ మాత్రమే! పిల్లవాడు కాదు. రాజకుమారుడు మంత్రిగారి వెనుక కూర్చుని కనిపించాడు. విషయం అర్థం గాక, రాజు నివ్వెర పోయాడు. ప్రభూ! క్షమించండి. మీ బిడ్డ ఇక్కడే మా వద్ద క్షేమంగా ఉన్నాడు. నదిలో పిల్లవాడి బొమ్మను మీరు చూడకుండా పడేసింది మేమే. మీ బిడ్డ నదిలో పడిపోయాడు అనగానే మీరే ఎందుకు నది లోకి దూకారు? నది లోకి దిగి మీ బిడ్డని కాపాడటానికి ఇంత మంది నావలో ఉన్నా, మీరే ఎందుకు రంగం లోకి దిగారు? మమ్మల్ని ఆజ్ఞాపించ వచ్చు కదా! ఆలోచించండి.

మీ బిడ్డపై ఉన్న ప్రేమ చేత ముందు వెనుక చూడకుండా మీరే ఎలా నది లోకి దూకారో, తన 

బిడ్డలైన భక్తుల మీద ఉండే ప్రేమ వల్ల భగవంతుడు కూడా తానే స్వయంగా అవతరిస్తాడు అని వినయంగా పలికి మంత్రి తల దించుకున్నాడు. రాజు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం చెందాడు. భగవంతుని అవతారానికి హేతువు ప్రేమే అని గ్రహించాడు.

భగవంతుని అవతార వైభవము, అవతారము సాధించే ప్రయోజనాలు తెలిశాయి. వీటిని తెలియడం వల్ల మన కేమి ప్రయోజనం? చెబుతున్నాడు.తదుపరి శ్లోకంలో .. 


links

https://archive.org/details/@sudarshan_reddy330 https://archive.org/details/@sudarshan_reddy330?query=swami+sundara+chaitanyananda videos:...